దేవతలు నిర్మించిన పవిత్ర నగరం.. రామజన్మభూమి అయోధ్య

Ram Janmabhoomi Ayodhya

Advertisements

&NewLine;<p>హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన &&num;8216&semi;అయోధ్య&&num;8217&semi; ప్రముఖమైనది&period; త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం&period; విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి&period; ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు&period; ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు&period; రామాయణాన్ని ఒక మహా కావ్యంగా&comma; సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు&period; అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి&comma; హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది&period; కేవలం హిందువులకే కాదు&period;&period; ముస్లిం&comma; బౌద్ధ&comma; జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ రామ జన్మభూమి విశేషాలు ఏమిటి&quest; ప్రజలతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధం ఏమిటి&quest; పర్యాటకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి&quest; అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period;<br>అయోధ్య చరిత్ర&colon;<br>అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం&period; శ్రీరాముని పూర్వీకుడైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు&period; మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కధనం&period; అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కధనాలు వివరిస్తున్నాయి&period; అలాగే ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు&period; సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు&period; ఆయన తన సత్య వాక్కుతో సూర్య వంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు&period; గంగను భువికి దించిన భగీరధుడు&comma; అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి&period; రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు&period; సూర్యవంశపు 63వ రాజు దశరధుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది&period; ఆ దశరధుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు&period; శ్రీ రాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంత కాలం రాజ్య పరిపాలన చేశాడు&period; అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు&period; వాల్మీకి రామాయణం&comma; తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది&period; కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి&comma; సుందరి&comma; పాడలిప్తసూరీశ్వరి&comma; హరిచంద్ర&comma; అచలభరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే&period; హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం&period; 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మతతీర్ధంకులైన వృషభ&comma; గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది&period;<br>హిందూ&comma; జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది&period; మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు&comma; స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు&period; క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్ధం వరకూ అయోధ్య బౌద్ధ మత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా&period; అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలు మార్లు సందర్శించినట్లు కూడా కధనం&period; అదే విధంగా మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు&period; దీంతో హిందూ&comma; బౌద్ధ&comma; జైన&comma; ముస్లిం మతాల పవిత్ర ప్రదేశంగా అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభించింది&period;<br>అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు&colon;<br>అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి&period; ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను&comma; మందిరాలను&comma; రామజన్మభూమిని&comma; ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు&period; సరయూ నది&comma; రామజన్మభూమి ఆలయం ప్రదేశం&comma; అన్నదాన సమాజం&comma; కౌసల్యాదేవి మందిరం&comma; హనుమద్ మందిరం&comma; వాల్మీకి మందిరం వంటివి ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనవి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..