వాణిజ్య నౌకను కాపాడిన భారత నేవీ

The Indian Navy saved the merchant ship

Advertisements

&NewLine;<p>అరేబియా సముద్రంలో సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్‌కు గురైన వాణిజ్య నౌకను భారతీయ నావికా దళం కాపాడింది&period; నౌకలోని హైజాకర్లను తరిమేసి 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని కాపాడింది&period; సుమారు ఆరుగురు ఆగంతకులు ఆయుధాలతో నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు&period; వెంటనే నౌకలోని సిబ్బంది తమను కాపాడాలంటూ ఎమర్జెన్సీ సందేశాన్ని పంపించారు&period; సమాచారం అందుకున్న వెంటనే ఐఎన్ఎస్ చెన్నై రంగంలోకి దిగింది&period; నౌకను చుట్టుముట్టి హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేసింది&period; ఈ క్రమంలో నేవీ కమెండోల బృందం మార్కోస్ నౌకలోకి ప్రవేశించింది&period; దీంతో&comma; బెదిరిపోయిన హైజాకర్లు నౌకను వదిలి పారిపోయారు&period; నౌకలో హైజాకర్లు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక నేవీ కమాండోలు నౌకలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు&period; అనంతరం&comma; రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్