Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home TelanganaKarimnagar బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు..

బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు..

by Rama
Singareni

సింగరేణి (Singareni):

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు. కేంద్రంలో బిజెపి సర్కారు అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన కార్మిక సంఘాలు గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రచారంలో కనిపించిన ఊపు ఈరోజు జరిగే సమ్మెలో మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.

Follow us on : Facebook, Instagram & YouTube.


రామగుండం ఏరియాలో ఉన్న భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై కార్మికులు యధావిధిగా ఉదయం షిఫ్ట్ లకు వెళ్లడం కనిపించింది. కాగా కొన్ని బొగ్గు గనులపై మాత్రం కార్మిక నేతల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అయితే స్థానికంగా ఉన్న కార్మిక సంఘాల మధ్య ఐక్యత లేదని తెలుస్తుంది. ప్రధానంగా సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్యం పొందిన కార్మిక సంఘాలు సమ్మెకు ఓవైపు పిలుపునిచ్చాయే గానీ… విజయవంతానికి మాత్రం సహకరించడం లేదంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. Read Also..

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039691
Total views : 199234

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: