తెలంగాణకే వెలుగునిచ్చే సింగరేణి సంస్థ లోని బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఆ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై గుర్తింపు కార్మిక సంఘంతో పాటు సిఐటియు ఆధ్వర్యంలోబొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన …, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం లేదంటూనే కేంద్ర సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదాలు చేశారు. బొగ్గు బ్లాక్ లను వేలం వేసే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కార్మికులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని, లేదంటే ఎంతటి పోరాటాల కైనా సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 149874