తెలంగాణకే వెలుగునిచ్చే సింగరేణి సంస్థ లోని బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఆ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై గుర్తింపు కార్మిక సంఘంతో పాటు సిఐటియు ఆధ్వర్యంలోబొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన …, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం లేదంటూనే కేంద్ర సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదాలు చేశారు. బొగ్గు బ్లాక్ లను వేలం వేసే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కార్మికులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని, లేదంటే ఎంతటి పోరాటాల కైనా సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కేరళంలోని వయనాడ్లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 74873