Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Latest News ఆస్తులు కాపాడుకునేందుకే ఎంపీగా పోటీ..

ఆస్తులు కాపాడుకునేందుకే ఎంపీగా పోటీ..

by Rama
BRS

కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలలో వివేక్ కుమారుడు పోటీ చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి (BRS) కొప్పుల ఈశ్వర్ (Koppula eswar) ధ్వజమెత్తారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు. దేశంలోనే అత్యంత సంపన్నులైన కుటుంబానికి చెందిన వివేక్ తమ ఆస్తులను పెంచుకునేందుకే పార్లమెంటు ఎన్నికలలో కుమారుడిని బరిలో దించుతున్నారని ఆరోపించారు. వివేక్ తండ్రి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని, అదేవిధంగా వివేక్ సైతం పలు పార్టీలు మారి ఆస్తులు కూడ పెట్టుకున్నారని అన్నారు. తన కుమారుడిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపారని తెలిపారు. ఇప్పటికే వివేక్ తన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారని అన్నారు. స్థానికుడు అయిన తనను ఆదరించాలని ప్రజలకు విన్నవించారు. సింగరేణి కార్మికుడిగా తనకు ఈ ప్రాంత సమస్యలపై అవగాహన ఉందని, వివేక్ కుమారుడు గెలిస్తే ఈ ప్రాంతానికి రాడని విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఇష్టకామేశ్వరి అమ్మవారి టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన..


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019589
Total views : 91183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.