Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home TelanganaKarimnagar బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు..

బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు..

by Rama
Singareni

సింగరేణి (Singareni):

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు. కేంద్రంలో బిజెపి సర్కారు అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన కార్మిక సంఘాలు గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రచారంలో కనిపించిన ఊపు ఈరోజు జరిగే సమ్మెలో మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.

Follow us on : Facebook, Instagram & YouTube.


రామగుండం ఏరియాలో ఉన్న భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై కార్మికులు యధావిధిగా ఉదయం షిఫ్ట్ లకు వెళ్లడం కనిపించింది. కాగా కొన్ని బొగ్గు గనులపై మాత్రం కార్మిక నేతల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అయితే స్థానికంగా ఉన్న కార్మిక సంఘాల మధ్య ఐక్యత లేదని తెలుస్తుంది. ప్రధానంగా సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్యం పొందిన కార్మిక సంఘాలు సమ్మెకు ఓవైపు పిలుపునిచ్చాయే గానీ… విజయవంతానికి మాత్రం సహకరించడం లేదంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. Read Also..

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: