11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడు..

psycho killer

Advertisements

&NewLine;<p>11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు&period; నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రామాటీ సత్యనారాయణ అనే హంతకుడు గుప్త నిధుల కోసం మంత్రాలు చేస్తానంటూ ఆస్తులు రాయించుకుని&comma; డబ్బులు తీసుకొని వారిని హత్యలు చేశాడు&period; నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు ఈ నిందితుడిని అరెస్టు చేసి డీఐజీ &comma;ఎల్ఎస్ చౌహన్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు&period; ఈ నిందితుడి పేరు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్ &lpar;47&rpar; సంవత్సరాలు&period; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు నాటు వైద్యం చేస్తూ అలాగే గుప్త నిధులు కోసం కూడా మంత్రాల చేసి తీస్తానంటూ చలామణి అవుతున్నాడు&period; గుప్తనిధుల తీయడానికి తన వద్దకు మంత్రాల కోసం వచ్చిన వారిని తను వశపరచుకొని వారి వద్ద నుంచి డబ్బులు&comma; అలాగే ప్లాట్లు&comma; భూములు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు&period; ఇక తీర గుప్తనిధులు తీసే ప్రదేశంలో మంత్రాలు నిర్వహించి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు అంటూ గన్నేరు పప్పు నూరిన విషయాన్ని తీర్థంలో కలిపి బాధితులకు ఇచ్చేవాడు&period; ఇలా తీసుకున్న తీర్థాన్ని సేవించిన వారు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందే వారు&period; మరికొందరిని బండరాళ్లతో కొట్టి చంపాడు ఈ నరరూప హంతకుడు&period; ఇలా నాగర్ కర్నూల్&comma; కొల్లాపూర్&comma; వనపర్తి&comma; కల్వకుర్తి అనంతపూర్ కర్ణాటక ప్రాంతాలలో 11 హత్యలు చేసినట్లు పోలీసులు ప్రస్తుత విచారణలో తేలింది&period;<br>1&comma;2020 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో నలుగురి హత్య కేసులో ఇతడు నిందితుడు&period;<br>2&comma;&comma; 2021 సంవత్సరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరినీ&period;<br>3&rpar; 2022 నాగర్కర్నూల్ జిల్లాలో సంవత్సరంలో ఒక్కరిని&period;<br>4&rpar; 2023 సంవత్సరంలో నలుగురిని హత్య చేశాడు ఈ నిందితుడు&period;<br>నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు&period; ఇవే కాక మరికొన్ని మిస్సింగ్ కేసులో హత్య కేసులో ఇతని పాత్ర పై పోలీసులు విచారణ చేస్తామన్నారు&period; కోర్టులో న్యాయమూర్తి ద్వారా అనుమతి తీసుకొని మరికొన్ని కేసులలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఐజి ఎల్ ఎస్ చౌహన్&comma; నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియా ముందు నేడు నిందితున్ని ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలియజేశారు&period; ఈ కేసులో దర్యాప్తు చేసిన నాగర్కర్నూల్ సిఐ&comma; ఎస్ఐ&comma; జిల్లా పోలీస్ బృందాన్ని డిఐజి అభినందించారు&period; వారికి రివార్డు అందేలా కృషి చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..