హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా నోడల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ శ్రీమన్, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసాం. అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వస్తుంది అని అన్నారు.
354
previous post





Total views : 197187