ఇరాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు..
ఇరాన్(Iran)తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్థాన్(Pakistan)ను అగ్రరాజ్యం అమెరికా(America) హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్(Ballistic Missile Program) సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. నెట్వర్క్ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…
స్థూలంగా చెప్పాలంటే ఇరాన్తో వ్యాపార ఒప్పందాలను పరిగణించే ఎవరైనా ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నామని అన్నారు. ప్రజల వినాశనానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పంపిణీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ మిసైల్ ప్రోగ్రామ్కు సరఫరాదారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి పరికరాలు, ఇతర వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మూడు రోజుల పాకిస్థాన్ సందర్శన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా రైసీ పాక్ పర్యటనలో ఇరుదేశాలు 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అఫ్ఘనిస్థాన్లోఆకస్మిక వరదలతో 300 మంది మృతి..!భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్(Afghanistan)లో 300 మంది పౌరులు మృతి చెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ వెల్లడించింది. బగ్లాన్, ఘోర్, హెరట్ ప్రాంతా లు వరదల ప్రభావానికి…
- మరోసారి అంతరిక్షయానం చేయనున్న సునీతా విలియమ్స్..భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె…
- బ్రిటిష్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత..టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్(Bernard Hill) కన్నుమూశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నావ కెప్టెన్గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి