Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం….

మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం….

by Prakash
Minors drop out of school and welcome to the beat of drums....

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మంత్రి జోగి రమేష్ పర్యటనలో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తో డప్పులు కొట్టించి స్వాగతం పలికించిన స్థానిక నాయకులు పట్టించుకోని అధికారులు. మొగల్తూరు మండలం రామన్న పాలెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కి స్వాగతం పలికెందుకు తీన్మార్ డప్పులు ఏర్పాటు చేసారు వైసీపీ నాయకులు అయితే ఆ డప్పులు కొట్టేవారందరూ విద్యార్థులు కావడం గమనార్హం. 100 రూపాయిలు ఇస్థాము అంటే స్కూల్ మానేసి వచ్చాము అని విద్యార్థులు చెప్పడం గమనార్హం. ఒక మంత్రి చీఫ్ విప్ పర్యటన లో మైనర్లు తో పనులు చేయించకూడదు అని తెలిసినా వారితో డప్పులు కొట్టించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం పలుకుతున్నా కనీసం మంత్రి గాని అధికారులు గాని ఖండించక పోవడం శోచనీయం. మంత్రి జోగి రమేష్ కు కూడా ఉన్న అధికారులుకు గాని మైనార్లు తో పనులు చేయిస్తే శిక్షర్హం అని తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతే కాదు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కి వచ్చిన మంత్రి ని గ్రామాలలో పలు సమస్యలు పరిష్కరించాలని మహిళలు నీలదీయడం మరో విశేషం.

Advertisements

You may also like

Our Visitor

009389
Total views : 62268

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.