ఆపదలో సింగరేణి ఆసుపత్రి సంజీవని అంబులెన్స్

Sanjeevini Ambulance

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఉన్న సంజీవని ఐసియూ అంబులెన్స్ కు జబ్బు చేసింది&period; అత్యవసర వైద్య చికిత్సల కోసం మెరుగైన వైద్యం కోసం సింగరేణి కార్మికులను ఉద్యోగులను ఇతర ప్రాంతాల కార్పొరేట్ అసుపత్రులకు తరలించే అన్ని వసతులు ఉన్న సింగరేణి ఐసియూ అంబులెన్స్ సంజీవని కి జబ్బు చేసింది&period; మూడు నెలల క్రితం అంబులెన్స్ కు సాంకేతిక లోపాలు రావడంతో మూలకు పడేశారు&period; సింగరేణి ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు లాంటి కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించే సమయంలో ఇదే అంబులెన్స్ లో పేషెంట్ కు పూర్తిస్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించే సౌకర్యాలు ఉండేవి&period; ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడే సకల సౌకర్యాలు ఉన్న ఈ సంజీవనికి మూడు నెలలు గడిచిన మరమ్మత్తులు చేయించాల్సిన సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు&period; సంజీవని మూలన పడడంతో ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ అద్దె అంబులెన్స్ లో పేషెంట్లను ఇతర కార్పోరేటు అసుపత్రిలకు తరలిస్తున్నారు&period; దీంతో మార్గం మద్యలో ప్రాణాలు పోయే అవకాశం ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు&period;<br>ఇప్పటికైనా సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ఐసియూ సేవలను అందించే సంజీవని అంబులెన్స్ కు రిపేరు చేయించి ప్రమాదాల బారిన పడిన కార్మికులు&comma; వారి కుటుంబ సభ్యులను మెరుగైన వైద్య సేవలకు ఇతర ప్రాంతాలకు సంజీవని అంబులెన్స్ ద్వారా తరలించి వారి ప్రాణాలను కాపాడాలని సింగరేణి కార్మికులు&comma; కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..