సార్వత్రిక ఎన్నికల(General Elections) సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్లలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల ఆస్తి, ఆయన పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
ఇది చదవండి: ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి..!
అదేవిధంగా రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాని అఫిడవిట్తో వెల్లడించారు. వారి వద్ద 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఇక చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్తో తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178 కోట్లు ఆస్తులుండగా, భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203 కోట్లు ఉన్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద ప్రస్తుతం చేతిలో రూ.60 లక్షల క్యాష్, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్రావు, శ్రవణ్రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో…
- ఎన్నికలకు సర్వం సిద్ధం..తెలంగాణలో లోక్సభ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.…
- వరంగల్ లో ఎన్నికల కు అధికారులు సర్వం సిద్ధం..!వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.