Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh భూ సర్వే లో తప్పులు తడకలు…

భూ సర్వే లో తప్పులు తడకలు…

by Prakash
భూ సర్వే, land survey

మరువాడ కొత్తవలస గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న భూమి మొత్తాన్ని తప్పుడు సర్వేలు చేసి రైతులను సంబంధిత అధికారులు నాన ఇబ్బంది పెడుతున్నారు. భూ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సుమారు 9 నెలలు అయినా అప్పటి నుంచి అధికారుల వద్దకు రైతులు వెళ్లి తమ భూములకు సంబంధించిన పత్రాలు తప్పుడు సర్వేలతో ఉన్నాయని రైతులు ఎంత వాపోతున్నా సచివాలయ మరియు భూ సర్వే అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామానికి చెందిన సర్పంచ్ కోరాడ శ్రీనివాస్ కి మూడు ఎకరాలు సాగుభూమి ఉండగా అదే సర్వేతో పక్క గ్రామం అయినా ఎడ్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి తమ భూమి ఆన్లైన్ చేశారని సర్పంచ్ అవేదన చెందారు. అధికారుల చుట్టూ గత ఎనిమిది నెలల నుంచి తిరుగుతూ ఉన్న కనీసం భూ సర్వేలో ఇటువంటి అవకతవకలు జరిగాయి అని రైతుల వద్ద కనీసం వివరాలు కూడా సిబ్బంది తీసుకోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నామని…
కానీ ఈ సర్వే మూలంగా తమ భూములను కోల్పోయామని రైతులు వాపోయారు. మండల స్థాయి మరియు జిల్లాలో గ్రీవెన్స్ కు వినతిపత్రాలు ఇచ్చిన
ఎటువంటి ఉపయోగం లేదని తమ భూములు మళ్ళీ తమ పేరుపై ఆన్లైన్లో లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ రైతులు వేడుకుంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019551
Total views : 91069

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.