మరువాడ కొత్తవలస గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న భూమి మొత్తాన్ని తప్పుడు సర్వేలు చేసి రైతులను సంబంధిత అధికారులు నాన ఇబ్బంది పెడుతున్నారు. భూ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సుమారు 9 నెలలు అయినా అప్పటి నుంచి అధికారుల వద్దకు రైతులు వెళ్లి తమ భూములకు సంబంధించిన పత్రాలు తప్పుడు సర్వేలతో ఉన్నాయని రైతులు ఎంత వాపోతున్నా సచివాలయ మరియు భూ సర్వే అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామానికి చెందిన సర్పంచ్ కోరాడ శ్రీనివాస్ కి మూడు ఎకరాలు సాగుభూమి ఉండగా అదే సర్వేతో పక్క గ్రామం అయినా ఎడ్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి తమ భూమి ఆన్లైన్ చేశారని సర్పంచ్ అవేదన చెందారు. అధికారుల చుట్టూ గత ఎనిమిది నెలల నుంచి తిరుగుతూ ఉన్న కనీసం భూ సర్వేలో ఇటువంటి అవకతవకలు జరిగాయి అని రైతుల వద్ద కనీసం వివరాలు కూడా సిబ్బంది తీసుకోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నామని…
కానీ ఈ సర్వే మూలంగా తమ భూములను కోల్పోయామని రైతులు వాపోయారు. మండల స్థాయి మరియు జిల్లాలో గ్రీవెన్స్ కు వినతిపత్రాలు ఇచ్చిన
ఎటువంటి ఉపయోగం లేదని తమ భూములు మళ్ళీ తమ పేరుపై ఆన్లైన్లో లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ రైతులు వేడుకుంటున్నారు.
Tag:
Land Survey
ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు రావడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చింది. ఆ నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ను ఆదేశించారు.





Total views : 79496