Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొంగులేటి సుధాకర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొంగులేటి సుధాకర్

by Prakash
ponguleti sudhakar reddy
తిరుమల

బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో ఆత్మనిర్భంధన్ భారత్ దిశగా మరో సారి బీజేపీ విజయం సాధించాలి. విశ్వ గురువుగా భారత్ మారాలంటే మోదీతోనే సారథ్యంలోనే సాధ్యం. తమిళనాడు డీఏంకే పాలనలో సనాతన ధర్మంపై దాడి జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యపై దేశమంతా ధ్వజమెత్తింది. 500 ఏళ్ళ అనంతరం అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠాపన జరగటం శుభప్రదం. కేవలం భారత్ లోనే కొందరు హైందవాన్ని వక్రబుద్ధితో చూసి ఓట్లుగా మలుచుకొని ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం హైందవాన్ని ఆహ్వానిస్తుంది. ఎల్కే అద్వానీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం. వెలుగులోకి రానీ వారిని వెలుగులోకి తెచ్చి వారికి అత్యుత్తమ పురస్కారాని మోదీ ప్రభుత్వం ఇస్తుంది. అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్న. రాష్ట్రంలో జనసేనతో పొత్తులో ఉన్నాం. కలిసి వచ్చే వారితో ప్రయాణం సాగిస్తాం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. భారత దేశానికి ఓ సేవకునిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు. తమిళనాడులో సైతం బీజేపీకి బలం పెరిగింది. అని తెలంగాణ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

014109
Total views : 79013

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.