దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. వారంతపు ట్రేడింగ్లో ఇన్వెస్టర్లకు ‘బ్లాక్ ఫ్రైడే’ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్బణం భయాలతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ సుమారు 1,100 పాయింట్లకు పైగా పతనమై 70,000 మార్కు దిగువకు చేరింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 350 పాయింట్ల వరకు నష్టపోయి కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది.





Total views : 56952