విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
Tag:




Total views : 56807