స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్,
బ్యానర్ లో
ఎమ్ అచ్చిబాబు సమర్పణలో
‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్ మరియు అనిరుద్ మహేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు, ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు.
మే 8న ఏ ఫిల్మ్ బై గిరి చిత్రాన్ని భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఎన్.పి తాపెశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ అందించారు అలాగే భరత్ ఎంసి, ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్.





Total views : 56691