కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. సుమారు 36 గంటల పాటు కనులవిందుగా సాగే ఈ ఉత్సవాల్లో బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏనుగులపై నుంచి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే ప్రత్యేక కార్యక్రమం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Tag:




Total views : 56592