విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు పరిశీలించారు.అలాగే ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కూడా పాల్గొన్నారు.ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు.. రేపు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.
Tag:




Total views : 56592