నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ర్యాలీ నిర్వహించి ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి ఆచారి కోరడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మొదట పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు బిజెపి పార్టీ కూడా ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి పథకంలో తీసుకు వెళ్తానని కేంద్రంలో తప్పనిసరిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని తనను గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా వేడుకున్నారు పలువురు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కర్నూల్ లో ర్యాలీ – కమలం గుర్తుకు ఓటు
231
previous post



Total views : 54791