Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ

జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ

by Satya
National Highway

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైఎస్సార్ సెంటర్, జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది. రెండు వర్గాలు వారు ఒకరిపై ఒకరు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ వైనం ఆకివీడు తెలకపాముల సామాజికవర్గం, సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య జరిగింది. మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే ఘర్షణకి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇరువర్గాలు వారు కర్రలతో కొట్టుకోవడంతో, పదిమంది తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాని, వీరిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆకివీడు ఎస్ఐ నాగబాబు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.