542
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో భారీ వర్షం కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అకాల వర్షంతో ప్రయాణికులు, మార్కెట్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నరసాపురం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




Total views : 57032