42
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల సోనియాగాంధీ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి, మార్చిలో ఆమె తీవ్ర ఆరోగ్యానికి గురయ్యారు. దీంతో సోనియాను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులపాటు చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరికొన్ని సార్లు స్వల్ప అస్వస్థతకు గురైతే..ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా.. పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్ పర్సన్గా ఉన్నారు.






Total views : 74911