ఝార్ఖండ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు మరో కీలక విజయంగా 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో జరిగిన ఈ సరెండర్ కార్యక్రమంలో పలువురు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ నవజీవన్’ ప్రభావంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని పేర్కొన్నారు.2026లో ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో హతమార్చగా..44 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 29 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. నేడు లొంగిపోయిన 27 మందికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
Tag:




Total views : 81760