25
ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు నాయకత్వం అనిపించుకోవని..ఓ జిమ్మిక్కు మాత్రమేనని అన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలను ఆయనే పాటించడం లేదని విమర్శించారు. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశంలో గ్యాస్, ఎరువులు, ఇంధనాల సరఫరా పూర్తిగా ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.





Total views : 81752