ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్త కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తాజా నిర్ణయం ప్రకటించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానం అమలు కానుంది.కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలపై ఇవాళ కీలక ప్రకటన చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తామని గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి అప్పటి సీఎం జగన్ బొమ్మతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. దీనిపై అభ్యంతరాలు వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ బొమ్మనుతీసేసి రాజముద్ర పెడతామని చంద్రబాబు ప్రకటించారు.మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పాస్ పుస్తకంపై గత ప్రభుత్వం జగన్ బొమ్మ వేసుకుందని ప్రజలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూమికి తన బొమ్మ వేసుకోవాలా అని వారిని ప్రశ్నించారు. తాను అలా వేసుకోనని, అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలనూ మారుస్తానని తెలిపారు. బొమ్మ తీసేస్తానని, రాజముద్రతో మీ భూములు మీకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా…
- సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష…
- యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్,…
- సింగపూర్లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..కొవిడ్-19 మళ్లీ సింగపూర్ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో…
- ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 82548