Friday, May 22, 2026
News Navigation
Friday, May 22, 2026
News Navigation

Breaking

Friday, May 22, 2026
Home Telangana పైప్ లైన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

పైప్ లైన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

by CVR NEWS
పైప్ లైన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

మిర్చి కాంపౌండ్ కు వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన పైప్ లైన్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజీ కారణంగా మురికి నీరు నల్లాల్లోకి వస్తున్నాయనీ..తద్వారా మంచినీరు కలుషితమవుతుందన్నారు. మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. మిర్చి కాంపౌండ్ లో చేతిపంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015623
Total views : 82540

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.