కార్తీక మాసం శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గ భవాని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆస్థాన వేద పండితులచే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోటి దీపోత్సవం లో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన పలువురు భక్తులు భారీగా తరలివచ్చారు.
Tag:
vijayawada kanaka durga temple
విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్. పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు,ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు.
అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్. 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన.
70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు,5 కోట్ల దాతల నిధులు,33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు. ప్రసాదం పోటు,అన్నప్రసాద భవనం,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్,కేశఖండన శాల నిర్మాణాలు.



Total views : 56894