Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

by Rama
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి..పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీ గా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరా లోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మెన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, పల్లే రాజు, అబ్దుల్ అజీజ్, నాయకులు ఉన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: