Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Latest News క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

by Rama
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి..పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీ గా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరా లోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మెన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, పల్లే రాజు, అబ్దుల్ అజీజ్, నాయకులు ఉన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
    అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
    సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
  • కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
  • భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..
    భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై…
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
    ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

008281
Total views : 54238

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.