గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చిన నిజం గెలవాలి – కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా…లుగుదేశం పార్టీ కార్యాలయం బయట నిజం గెలవాలి న్యాయం జరగాలి అంటూ న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. వినూత్న రీతిలో మోకాళ్ళ పైన నిలపడి న్యాయదేవత కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని, న్యాయాన్ని బ్రతికించి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమయిందని వేడుకున్నారు. అన్యాయం శిక్షింపబడాలని ఈ కార్యక్రమంలో న్యాయదేవతగా జిల్లా తెలుగుమహిళా అధికార ప్రతినిధి పేరం అనిత కుమారి, తెలుగు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కొత్తూరి వెంకట్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేళం సైదయ్య, తెలుగుయువత విద్యార్థి నేతలు మహిళలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.
బాబు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రావిపాటి
298
previous post




Total views : 54876