ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి అనే పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో మరణించిన తురిమెల్ల పరిశుద్దరావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు అనంతరం మూడు లక్షల రూపాయిల చెక్కును అందించారు. అక్కడ నుండి ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలో మరణించిన బత్తిని హనుమంత రావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్నిఅందించారు. అక్కడ నుండి తాళ్లూరు మండలం గుంటిగంగ దేవాలయం వద్ద గల తేజా వృద్ధాశ్రమం నందు జంపాల నరసింహ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. భువనేశ్వరి వెంట టీడీపీ జిల్లా నాయకులు ఉన్నారు.
chandra babu arrest
అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్.మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్ ను నారా భువనేశ్వరి అందజేశారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బయలుదేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడలో పర్యటించనున్నారు. రేపు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. ఎల్లుండి అనపర్తి నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తారు.
యువగళం పాదయాత్ర 2.0 అంటూ ప్రకటన వచ్చింది కదా అధికార వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా, ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు బాగా కంగారు పడుతున్నారు. అందుకు తగ్గట్లుగా యాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చేలా చేశారో లెక్కేలేదు.ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. పైగా యువగళం 2.0 పాదయాత్రలో నారా లోకేశ్ ప్రస్తావించే ప్రధాన అంశం.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కక్ష్యసాధింపు తీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. జనాదరణ కూడా గతంలో కంటే మరింతగా ఉంటుంది. ఈ పరిణామాలు ఊహించుకొనే ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. యువగళం సాగే ప్రాంతాల్లోని నేతలకు దానికి అడ్డంకులు సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని కూడా సమాచారం
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని నాలుగున్నర సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి ఎన్నికల ముందు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. ప్రివిలేజ్ ఫీజు తగ్గించారని అబద్ధపు ఆరోపణలు చేసి జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు అన్నారు. ప్రివిలేజ్ పీజీకి సంబంధించి మద్యం వ్యాపారుల విజ్ఞప్తిని నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు 1800 కోట్ల ఆదాయం వచ్చింది అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేయడమే కాకుండా, దొంగ కేసులు బనాయించి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడా దొరకని కల్తీ మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, 24 వేల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంపై నిందలు వేస్తూ, జగన్ రెడ్డి చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలని కుట్ర పన్నాడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యంపై జగన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులకు న్యాయస్థానంలో పోరాడడానికి మేము సిద్ధం! రాష్ట్రంలోని మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా,డిస్లరీల పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు గారికి బెయిల్ తద్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లులో ఏదో జరిగిందని దొంగ కేసు పెట్టాడు అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అవినీతిపరులో గమనిస్తున్నారని, వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర చేస్తానని అంటున్నారు, నిజం గెలవాలని మీరు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది. మీరు ఎంతో తెలివైన వారు ప్రజలు అమాయకులు ఏమైనా వింటారు అనేగా మీ ఉద్దేశ్యం. తన సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి చనిపోయేలా చేసిన చంద్రబాబుని ఏమి అనని భువనేశ్వరి ఈరోజు తప్పు చేసి దోషిగా జైలుకు వెళితే తాను పోరాటం చేస్తాను అనడం ఎంత దారుణం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది మీరు నిజం గెలవాలని చెప్పడం. చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? నారా లోకేష్ కెమెరా మెన్ గంగ సినిమాలో లాగా తన తండ్రిని పక్కకు తప్పించి తాను చంద్రబాబు స్థానంలోకి రావడానికి చూస్తున్నారని నుమానం. రెండు అక్రమ పార్టీలు అక్రమ కలయిక ఈరోజు జిల్లాలో పెట్టారు. ఇక్కడ సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ జనసేన నాయకులు మదన పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి.
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చిన నిజం గెలవాలి – కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా…లుగుదేశం పార్టీ కార్యాలయం బయట నిజం గెలవాలి న్యాయం జరగాలి అంటూ న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. వినూత్న రీతిలో మోకాళ్ళ పైన నిలపడి న్యాయదేవత కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని, న్యాయాన్ని బ్రతికించి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమయిందని వేడుకున్నారు. అన్యాయం శిక్షింపబడాలని ఈ కార్యక్రమంలో న్యాయదేవతగా జిల్లా తెలుగుమహిళా అధికార ప్రతినిధి పేరం అనిత కుమారి, తెలుగు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కొత్తూరి వెంకట్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేళం సైదయ్య, తెలుగుయువత విద్యార్థి నేతలు మహిళలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 51 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా బ్లాక్ డ్రెస్లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని తెలిపారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. జైలు గోడల ఆవల ఉన్న తన భర్త క్షేమం కోసం తనతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నానన్నారు. నారా బ్రాహ్మణి కూడా స్పందిస్తూ వారిని ఆ లేఖ తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందన్నారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు నారా బ్రాహ్మణి.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.