Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh వీరంకి గురుమూర్తి కామెంట్స్..

వీరంకి గురుమూర్తి కామెంట్స్..

by Rama
veeranki gurumurthy

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని నాలుగున్నర సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి ఎన్నికల ముందు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. ప్రివిలేజ్ ఫీజు తగ్గించారని అబద్ధపు ఆరోపణలు చేసి జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు అన్నారు. ప్రివిలేజ్ పీజీకి సంబంధించి మద్యం వ్యాపారుల విజ్ఞప్తిని నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు 1800 కోట్ల ఆదాయం వచ్చింది అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేయడమే కాకుండా, దొంగ కేసులు బనాయించి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడా దొరకని కల్తీ మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, 24 వేల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంపై నిందలు వేస్తూ, జగన్ రెడ్డి చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలని కుట్ర పన్నాడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యంపై జగన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులకు న్యాయస్థానంలో పోరాడడానికి మేము సిద్ధం! రాష్ట్రంలోని మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా,డిస్లరీల పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు గారికి బెయిల్ తద్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లులో ఏదో జరిగిందని దొంగ కేసు పెట్టాడు అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అవినీతిపరులో గమనిస్తున్నారని, వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

039720
Total views : 199736

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: