Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh నిజం గెలవాలని లనే కార్యక్రమం పై సంచలన వ్యాఖ్యలు

నిజం గెలవాలని లనే కార్యక్రమం పై సంచలన వ్యాఖ్యలు

by Rama
Kottu satyanarayana

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర చేస్తానని అంటున్నారు, నిజం గెలవాలని మీరు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది. మీరు ఎంతో తెలివైన వారు ప్రజలు అమాయకులు ఏమైనా వింటారు అనేగా మీ ఉద్దేశ్యం. తన సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి చనిపోయేలా చేసిన చంద్రబాబుని ఏమి అనని భువనేశ్వరి ఈరోజు తప్పు చేసి దోషిగా జైలుకు వెళితే తాను పోరాటం చేస్తాను అనడం ఎంత దారుణం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది మీరు నిజం గెలవాలని చెప్పడం. చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? నారా లోకేష్ కెమెరా మెన్ గంగ సినిమాలో లాగా తన తండ్రిని పక్కకు తప్పించి తాను చంద్రబాబు స్థానంలోకి రావడానికి చూస్తున్నారని నుమానం. రెండు అక్రమ పార్టీలు అక్రమ కలయిక ఈరోజు జిల్లాలో పెట్టారు. ఇక్కడ సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ జనసేన నాయకులు మదన పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: