13
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి, పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు. మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ వంటి కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు, వస్త్ర బహుమతులు అందజేయగా, ఉత్సవాలు ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్నాయి.




Total views : 56585