Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా ..

గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా ..

by CVR NEWS
గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల దందా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ సేవలు పొందేందుకు వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి . కార్యాలయాల బయటే తిష్ట వేసే దళారులు… సిబ్బంది, అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది . భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ ధృవీకరణ వంటి పనులకు అధికారిక రుసుములకంటే ఎక్కువ మొత్తాలు అడుగుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కార్యాలయాల్లో పారదర్శకత లేకపోవడం, సేవలపై స్పష్టమైన సమాచారం అందకపోవడం వల్లే ఈ దందా రోజురోజుకూ పెరుగుతోందని అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దళారుల వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణ ప్రజలకు సేవలు అందాల్సిన చోట… దళారుల ఆధిపత్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో ఈ వ్యవహారం మరింత బహిరంగంగా కొనసాగుతోందని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు నిబంధనలు తెలియకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. “త్వరగా పని పూర్తవుతుంది” అంటూ ప్రజలను మోసం చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందితో ఉన్న సంబంధాల ఆధారంగా దళారులు కార్యాలయ వ్యవస్థనే తమ చేతుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ విధానాలను మరింత బలోపేతం చేసి, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ముఖ్యంగా భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు, వృద్ధులు, చదువు లేని ప్రజలు ఈ దందాకు బలవుతున్నారు. అధికారిక ఫీజులపై స్పష్టత లేకపోవడం, కార్యాలయాల్లో సరైన మార్గదర్శక బోర్డులు లేకపోవడం కూడా సమస్యను మరింత పెంచుతోందని చెబుతున్నారు. ఒక వేళ సొంతగా డాకుమెంట్స్ తీసుకొని ఆఫీస్ లోపలి వెళితే ఎదో ఒక సాకు చూపి డాక్యుమెంట్ ను రిజెక్ట్ చేస్తున్నారు . ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందాల్సిన సమయంలో… మధ్యవర్తుల ఆధిపత్యం పెరగడం ప్రజాస్వామ్య పరిపాలనకు మంచిది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దళారులపై ప్రత్యేక దాడులు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మారుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012383
Total views : 74908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.