పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆరేటి నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజ్ మ్యాన్హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు.భీమడోలు నుంచి వచ్చిన మొత్తం ఎనిమిది మంది కూలీలు డ్రైనేజ్ పూడిక తీత పనులు చేపట్టారు. వీరిలో ముగ్గురు కార్మికులు మ్యాన్హోల్లోకి దిగారు. అకస్మాత్తుగా విష వాయువు వెలువడటంతో వెంకన్న అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజు, ప్రభాకర్ అనే మరో ఇద్దరు కార్మికులు స్పృహ కోల్పోయారు.
Tag:




Total views : 81759