గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. జువెలరీ షాప్ కి వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గత అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల వెండి 16 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల సమక్షంలో క్లోస్ టీం సహాయంతో షాపులోని వేలిముద్రలు సేకరించారు. అలాగే సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Also….
Read Also….





Total views : 89725