భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది. భారతదేశానికి చెందిన అత్యంత ఆదరణ పొందిన మామిడి పండ్ల ఎగుమతులపై జపాన్ ప్రభుత్వం హఠాత్తుగా విధించిన ఈ నిషేధం దేశీయ వ్యవసాయ వాణిజ్య రంగానికి భారీ ఎదురుదెబ్బగా మారింది. గడిచిన 20 సంవత్సరాలలో జపాన్ ఇలా భారత మామిడి పండ్లపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ప్రస్తుత సీజన్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా జపాన్ వ్యవసాయ, అటవీ, మత్స్య మంత్రిత్వ శాఖ ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిషేధం కారణంగా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన భారతదేశపు ప్రీమియం మామిడి రకాలైన అల్ఫోన్సో , కేసర్ , లంగ్డా , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఎగుమతి అయ్యే బంగినపల్లి రకాల రవాణా జపాన్ మార్కెట్కు పూర్తిగా నిలిచిపోయింది.
Tag:





Total views : 89593