వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ ఏర్పడ్డాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి… ఇవాళ ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబాలకోటలో జరిగిన రోడ్ షోలో తంబళ్లపల్లి ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి, టిడిపి స్టార్ క్యాంపెనియన్ పనబాతు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు.. అనంతరం జరిగిన పబ్లిక్ మీటింగ్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిందని, వైయస్ వివేకానంద రెడ్డి మృతి చెంది ఐదేళ్లు గడిచినా ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని, సొంత బాబాయ్ కి న్యాయం చేయలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేయగలరని ఆయన ప్రశ్నించారు… ఈ రోడ్ షోలో బిజెపి సీనియర్ లీడర్ చల్లపల్లి నరసింహారెడ్డి కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోత సీజన్లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
- విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నక్కపల్లి మండలానికి చెందిన శ్రీనుపై గతంలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు స్కూటీలు,…
- నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం…




Total views : 54856