తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తిరుపతి జిల్లా మల్లె మడుగు ప్రాజెక్టు కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మల్లె మడుగు రిజర్వాయర్ వర్షాలకు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు 22 గేట్లను మేర ఎత్తి 22 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచామని ఈ ఈ మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ అర్చన తెలిపారు.
Tag:
Reservoir
ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలి ఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.