Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshChittoor పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈఓ

పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈఓ

by Rama
TTD E.O.

అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని, అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అన్నారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని గుర్తు చేసారు. ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి…మరమ్మత్తులు అవకాశం లేదని తేల్చి చెప్పారు. 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తాం అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సునితమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదు అని,మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. పార్వేట మండపం పరిశీలనకు బిజేపీ భానుప్రకాష్ ని నేను స్వాగతిస్తున్నా, మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈఓ ధర్మరెడ్డి.

Advertisements

You may also like

Our Visitor

012529
Total views : 75305

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.