44
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 24లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 800 ప్రాజెక్టులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాస్తా ఆంధ్రప్రెన్యూర్ కావాలన్న సీఎం లక్ష్యాన్ని కలసికట్టుగా సాధిద్దామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పెట్టుబడులు, నిధుల సమీకరణ, అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ లు తయారు చేసి దేశానికి అందించే ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు.





Total views : 75962