పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. బీజేపీ అగ్రనేత సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి చెందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతపై సువేందు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మరోసారి అదే ఉత్కంఠభరిత పోరు భవానీపూర్లోనూ రిపీట్ అయింది. కౌంటింగ్ ప్రారంభం నుండి హోరాహోరీగా సాగిన ఈ పోరులో, చివరికి సువేందు అధికారి విజయం సాధించి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తీశారు. దశాబ్దాలుగా మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న భవానీపూర్లో బీజేపీ జెండా ఎగురవేయడం విశేషం. బెంగాల్ రాజకీయాల్లో మమతకు ధీటైన ప్రత్యర్థి తానేనని సువేందు అధికారి మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతున్న వేళ, ఏకంగా ముఖ్యమంత్రే ఓడిపోవడం తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మమతా బెనర్జీ ఓటమితో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం ఆ పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. మరోవైపు, సువేందు అధికారి తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని అధిగమించి, బెంగాల్ బీజేపీలో తిరుగులేని నాయకుడిగా అవతరించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
74
previous post






Total views : 75358