తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల తమకంపల్లిలో గంగ జాతర వేడుకలు వైభవంగా జరిగాయి. కమతంపల్లిలోని సత్యమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహానికి గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించారు.గత వారం రోజులుగా అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టి పొంగిళ్లు పెట్టడం, అంబలి పోయడం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామం నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో స్థిరపడిన వారు కూడా ప్రత్యేకంగా స్వగ్రామానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Tag:





Total views : 89168