నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మొత్తం విషయాలను కాకుండా, కేవలం ఒక లైన్ను మాత్రమే తీసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం సరికాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజాస్వామ్యమా? గుండాయిజమా?: మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం… అనే ధోరణి ప్రజాస్వామ్యం అనిపించుకోదని, అది రాజకీయ గుండాయిజం అవుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ప్రొఫెసర్ మాటల్లో తప్పు ఉంటే ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలే తప్ప… వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, కేసులతో భయపెట్టడం కొత్త రాజకీయ సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Tag:




Total views : 89959