15
జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న ఈ సభకు ఆ పార్టీ అధినేత పవన కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదికలో ప్రకటన చేసింది. కాగా సభా ప్రదేశం తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు.




Total views : 89240