తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆశావాహ దృక్పథాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్వార్థ పార్టీలని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రావటంలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలని కాంగ్రెస్కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే నా లక్ష్యమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు.
Bjp elections
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓయూ జెఎసి వ్యవస్థాపక సభ్యులు ప్రధానమంత్రి మోడీ బిసి అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం తో మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎనగంటి రాజు నేత ఈ కార్యక్రమంలో ఓయూ జెఏసి వ్యవస్థాపక సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 75 సంవత్సరాలలో ఏ ఒక్క పార్టీ కూడా బీసీ అభ్యర్థులను సీఎం చేస్తానని ప్రకటించలేదు. బిజెపి పార్టీ మాత్రం తెలంగాణలో 80 శాతం ఉన్న 136 ఉపకులాల బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మునుగోడులో బిజెపికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఒక కెసిఆర్ వంద అబద్దాల పేరుతో కరపత్రాలు తయారు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామని తొమ్మిది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను యువతను మోసం చేస్తూనే ఉంది ఏ యొక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుఉద్యోగులు, యువత కోసం ఏ ఒక్క హామీ లేదు యువత ఏ ఒక్కరు కూడా బారాస కు ఓటేయొద్దని తెలిపిన ఓయూ వ్యవస్థాప సభ్యుడు రాజు నేత తెలిపారు.
Read Also..
నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారు. 30 తేదిన విజయానికి సంకేతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బిజేపి గెలుస్తదని డిసైడ్ చేసాడు. బండిసంజయ్ భూదందాలు చేయలేదు. ఖబ్జాలు చేయలేదు. కరీంనగర్ అభివృద్ధి కి నిధులు తిసుకువచ్చింది ఎవరు, అభివృద్ధి అడ్డం పడ్డది ఎవరూ బండిసంజయ్ ని అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కొట్లు కరీంనగర్ కి పంపుతున్నారు. కరీంనగర్ బండిసంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారు. కెటిఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు. కెటిఆర్ వి అహంకారం అహంకారం మాటలు. బిఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు. టిఎస్ పిఎస్సి సమస్య చిన్నది అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి. నిరుద్యోగ సమస్యల కొసం బిజేపి పొరాటం చేస్తే జైలుకు పంపారు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టడానికి చెతులు కలపాలి. నరేంద్ర మోడి బిసి అత్మగౌరవ సభకి వస్తున్నారు, బిసి వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కెసిఆర్ కి బిసి ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా. బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు. కెసిఆర్ కుటుంబం అహంకారానికి, తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం. కెసిఆర్ రాజ్యాంగం కావాలా… అంబేద్కర్ రాజ్యాంగం కావాలా తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు. ఒకసారి బిజేపి పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివెయకండి….గెలిపించండి.
జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. డబ్బులు ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్థానికేతుడు వద్దు స్థానికుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదని జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగే సమయంలో అయ్యా మాకు టికెట్ కావాలి అని దీక్షలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి మాకు కలిగింది. అంటే మా నాయకత్వం ఏం చేస్తుంది మా నాయకులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అసలు ఇంతవరకు కూడా ఏ రోజులో కూడా ప్రజా పోరాటంలో లేని వ్యక్తులు, ఇంతవరకు కూడా ఇక్కడున్న దుర్మార్గుడైన శాసనసభ్యున్ని ఎండగట్టని వ్యక్తులు మా పార్టీకి టికెట్ కావాలని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.




Total views : 57030