భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని.. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని మోదీ తెలిపారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానమని.. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని.. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారని మోదీ ఫైర్ అయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…
- వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం…
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి